హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!

0
6
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. సైబర్ టవర్స్ నుండి యశోద హాస్పిటల్స్ వరకు ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఓవర్ ద బ్రిడ్జి (RoB) నిర్మాణం కారణంగా సెప్టెంబర్ 14 నుండి 30 వరకు ఈ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్టీయూ మరియు మూసాపేట్ వైపు వెళ్ళే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ మరియు మూసాపేట్ వైపు వెళ్ళే ట్రాఫిక్ పర్వతనగర్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని ఖైత్లాపూర్ వంతెన మీదుగా వెళ్లాలని సూచించారు. ఐకియా, సైబర్ గేట్‌వే మరియు COD జంక్షన్ నుండి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా జేఎన్టీయూ వైపు వెళ్ళే ప్రయాణికులు నేరుగా JNTU వైపు ప్రయాణాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు.